UPDATES  

 ఐ కె పి లొ పనిచేస్తున్న వివొఎ (గ్రామ దీపికలు)ల సమస్యలను పరిస్కరించాలని -ఎపిఎమ్ కువినతి పత్రం అందజేత..

మన్యం న్యూస్. ములకలపల్లి. మార్చి 20. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీవోఏ (గ్రామ దీపిక)ల సమస్యలను పరిస్కరించాలని, వి వొ ఏ లుగా పనిచేస్తున్న తమకు ప్రత్యక్ష, పరోక్షంగా పని భారం పెరుగుతూవస్తుందని, పనికి తగిన గుర్తింపు లేక, సరైన వేతనం లేక , ప్రస్తుతం ఉన్న పరిస్థితి లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివొఏ లు అందరు పారిశ్రామిక విధానాల చట్టం 1947సెక్షన్ -22సబ్ సెక్షన్ -1అనుసరించి వీవోఏ జిల్లా కమిటీ నిర్ణయం మేరకు మార్చి 20 నుండి ఏప్రిల్ 2 తారీకు వరకు 13రోజులు వరకు ఆన్లైన్, ఆఫ్ లైన్ పనులను నిలిపివేస్తున్నమని మెమోరాండం ఎపిఎమ్ కి అందజేశారు.ఈ కార్యక్రమంలో కనక మహాలక్ష్మి,ఎస్ కె షఫీయా, పెద్దుల్లమ్మ, జ్యోతి, కృష్ణకుమారి, విజయ్, సునీత, నర్సకుమారి, స్వరూప, కృష్ణకుమారి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !