మన్యం న్యూస్ మణుగూరు టౌన్..
మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ నందు వివిధ విభాగాలలో పని చేస్తూ ప్యూన్ గా పని చేయుటకు ఆసక్తి, అర్హత గల అంతర్గత ఉద్యోగుల కొరకు గురువారం పైలట్ కాలనీ లోని ఎంవిటీసీ కార్యలయం నందు వ్రాత పరీక్ష నిర్వహించడం జరిగింది.ఈ పరీక్ష ఏరియా ఎస్ ఓ టు జిఎం డి.లలిత్ కుమార్,ఏరియా డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్ పర్యవేక్షణ లో నిర్వహించారు. ముందుగా వారు సీల్డ్ కవర్లో ఉన్న ప్రశ్న పత్రాన్ని ఓపెన్ చేసి అభ్యర్ధులకు అందజేయడం జరిగింది.రెండు పోస్టుల కోసం నలుగురు అభ్యర్థులు హాజరు కాగా,వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఇద్దరు అభ్యర్ధులను ఎంపిక చేయడం జరిగింది అని వారు తెలిపారు.పూర్తి పారదర్శకంగా జరిగిన ఈ పరీక్ష ఫలితాలను సాయంత్రం 5:00 గంటలకు నోటిస్ బోర్డు ద్వారా తెలియజేయడం జరుగుతుంది అన్నారు.ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఏరియాలో ఉన్న ఖాళీలకు అనుగుణంగా ప్యూన్ ఉద్యోగంలో నియామకం చేపట్టడం జరుగుతుందని డిజిఎం పర్సనల్ అధికార ప్రతినిధి ఎస్ రమేశ్ తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఎంవిటిసి మేనేజర్ లక్ష్మణ్ రావు,సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.