UPDATES  

 కస్తూర్బా విద్యార్థినులకు ఆయుష్ న్యూట్రిషనల్ కిట్ల పంపిణీ..

మన్యం న్యూస్, పినపాక:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ఆయుష్ శాఖ  ఆదేశాల మేరకు అశ్వాపురం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యులు గుమ్మడి.అరుణ  ఆధ్వర్యంలో ఎల్చిరెడ్డిపల్లి లోని కస్తూర్బా పాఠశాల లో గురువారం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ విచ్చేశారు. ఈ సందర్భంగా వైద్యురాలు అరుణ మాట్లాడుతూ, విద్యార్థినులకు పోషకాహారంగా రాగిలడ్డూలు,మెమరీ బూస్టర్ అయినటువంటి బ్రహ్మీ గ్రాన్యూల్స్  అందిస్తున్నామని, విద్యార్థులందరూ ఉపయోగించాలని కోరారు.  రాగి లడ్డుు  రక్తహీనత  నుంచి బాలికలు దూరంగా ఉంటారని  , బ్రాహ్మీ గ్రాన్యుల్స్ వలన వలన విద్యార్థినులలో ఏకాగ్రత మరియు మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు అని వివరించారుు.  సాంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం యొక్క విశిష్టతను, జీవనశైలి మార్పుల వల్ల వచ్చే వ్యాధుల గురించి వివరించి ఆయుష్ ఆరోగ్యకర దీపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు  ఆయుష్ సిబ్బంది రాధిక, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !