మణుగూరు:
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గత నాలుగురోజులుగా అస్వస్థతకు గురై ఇబ్బందిపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని స్థానిక ఆస్పత్రిలో దగ్గు జలుబు అనారోగ్య సమస్యల నేపథ్యంలో సోమవారం చికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆస్పత్రిని సందర్శించి, రేగా ఆరోగ్యస్థితి వాకబుచేశారు. ఎమ్మెల్యే రేగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
…….