మన్యం న్యూస్,ఇల్లందు టౌన్..2023-24 ఆర్థిక సంవత్సరంనకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏప్రిల్ 30 తేదీ వరకు ఆస్తిపన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ కల్పించినట్లు ఇల్లందు మున్సిపల్ కమిషనర్ అంకుషావలి ఆదివారం పత్రికా ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రజలు ఇట్టి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆస్తిపన్నులు, నల్లాబిల్లులు చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ రాయితీ సదుపాయం కేవలం ఏప్రిల్ నెలాఖరు లోగా చెల్లించేవారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు.
