UPDATES  

 ఆదివాసి నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ కు వినతి….

 

మన్యం న్యూస్ చండ్రుగొండ ఏప్రిల్ 10 : అర్హులైన నిరుపేద ఆదివాసీలకు మండల కేంద్రంలోనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆదివాసి సంఘం జిల్లా నాయకులు కుంజా వెంకటేష్ దొర డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ కు మండల ఆదివాసీలతో కలిసి వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కొన్ని సంవత్సరాలుగా ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అర్హత మేరకు ఆదివాసీలకు మండల కేంద్రంలో ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ నాయకులు తెల్లం నరసింహారావు దొర,కొడెం నరసింహారావు దొర, పద్దం యశోద, బచ్చల రమణ,బద్దం బుచ్చమ్మ,తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !