UPDATES  

 పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టీకరణ

  • కట్టప్పలు గోడ మీద పిల్లులు వెళ్లిపోయారు
  • నికార్సేన తెలంగాణ తేజం ముందున్నది
  • రండి తెలంగాణ వాడిని దేశవ్యాప్తంగా చవి చూపుదాం
  • భయమేల మిత్రమా.. అభియం ఇస్తున్న
  • నట కిరీటిలు పగటి వేషాదారులు మాటలు నమ్మకండి
  • నేనున్న మీ బిడ్డగా ఆశీర్వదించండి. కష్టం వచ్చినా నిలబడతా ప్రభుత్వంతో కలబడతా
  • పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టీకరణ

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
.
. ఎన్నాళ్ళు ఎదురుచూసిన సమయం రానే వచ్చింది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే ప్రబుద్ధులు వై దొలిగారు. కట్టప్పల పరిస్థితి చెప్పనవసరం లేదు. నక్క వినయాలతో ప్రజలను మస్బూసి మారేడు కాయ చేసే మాంత్రికులు ఉన్నారు. నిలువ నీడనిచ్చే కొమ్మను నరుక్కునే నీతిమాలిన నాయకులందరూ వెళ్లిపోయారు. ఇక గోడ మీద పిల్లల నటించే ప్రబుద్ధులు మాట అవసరం లేదు. ఇప్పుడు తేటతెలమయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నికార్సేన తెలంగాణ తేజం ముందుంది. రండి ఎన్నికల రణరంగంలో పోరాడదాం కలబడి నిలబడదాం. అంటూ పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు సంబంధిత తెలంగాణ వాదులకు పిలుపునిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఒకప్పుడు తెలంగాణ పంచన చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నమ్ముకొని ఆయన వెంటే మేమున్నామని ప్రగల్బాలు పలుకుతూ మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమవుతున్నమని ప్రకటించిన నేతలు ఒక్కసారి ఆలోచించండి బతుకు జీవుడా అంటూ భరోసిచ్చిన నాయకులను వదిలి ఏం సాధించేందుకు ప్రకటిస్తున్నారు తెలియడం లేదని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ చెట్టు నీడన బతికినోళ్లు కాయలను అమ్ముకున్న ప్రగల్బాలు నేడు పలుకుతూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడమే తప్ప సాధించేది ఏమీ లేదని హితం పలికారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కట్టప్పలు గోడమీద పిల్లులు వలస వెళ్లిపోయారని నికార్సైన తెలంగాణ వాదాన్ని బలంగా ఇనుముడింపజేసే నాయకులు కార్యకర్తలు మిగిలి ఉన్నారని మరో ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యే రేగా పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన తర్వాత తాము బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైపే మాపైనమని ప్రకటించుకునే నేతలు కార్యకర్తలు ఒకసారి ఆత్మ విమర్శన చేసుకుంటే తెలంగాణలో భవిష్యత్తు భావితరాలకు ఉపయోగపడుతుందని పినపాక ఎమ్మెల్యే రేగా హితువు పలికారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెబుతూ బరిలోకి దిగే కార్యకర్తలు నాయకులు సైనికులుగా పనిచేస్తారని నక్క వినియాలతో మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మబ్యా పెట్టే పగటివేషగాలను మాటలను నమ్మి మోసపోవద్దని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఒక సముచితమైన స్థానాన్ని కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి వారి స్థానాలను నిలుపుకోలేక పక్కదారి పట్టారని డబ్బులతో ప్రజలను మభ్య పెట్టే స్థితికి వచ్చారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆత్మీయ సమ్మేళనాలు.. ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందులు ఇచ్చినంత మాత్రాన ఆలోచించుకొని అడిగేసే స్థితిలో తెలంగాణ బిడ్డలు ఉన్నారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం తద్యమని ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నిన చివరకు విజయం బిఆర్ఎస్ పార్టీదే సాధ్యమన్నారు .పినపాక నియోజకవర్గంలో పాయం వెంకటేశ్వర్లు ఇల్లందు నియోజకవర్గంలో ప్రస్తుత జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యలు పగటి కలలు కంటున్నారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సహనానికి పరీక్ష పెట్టి ఏదో ప్రయత్నం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తామని అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ నేతలను అడుగుపెట్టనివ్వమని ప్రగల్బాలు పలుకుతున్న నేతలకు ప్రజలు గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు. ఇల్లందు నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన ఎందుకు ఓడిపోయాడని ప్రజలు ఎందుకు గుణపాఠం చెప్పారని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా మని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ కు దీటుగా ముందు నిలబడి ప్రశ్నించే దమ్ము ఉందా అని స్పష్టం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలను స్వయంగా నోటి నుండే వెలువడి ప్రజలకు తెలియజేసిన తెలంగాణ విద్రోహులు మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య కాదా అని ప్రశ్నించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !