గుప్తనిధుల పేర టోకరా చేసిన ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
రూ.4.50లక్షలు సొమ్ము రికవరీ
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
గుప్తనిధుల కోసం ఒకరా చేసిన ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పెళ్లి మండలం పోలీసులు చేదించారు. పలువురు ముఠా నుంచి రూ. 4.50 లక్షలు సొమ్మును రికవరీ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం లక్ష్మీదేవి పల్లి పోలీసులు వివరాలను వెల్లడించారు. లక్ష్మీదేవిపల్లి మండలం లోని అనిశెట్టిపల్లి గ్రామానికి చెందిన జలారాపు శేషగిరి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ రమాకాంత్ వివరించారు ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ జాలరపు శేషగిరి కి తన బామ్మర్ది ఎదురుగడ్డ ఉప సర్పంచ్ వినోద్ మార్చ్ 17వ తేదీన ఫోన్ చేసి తన మిత్రులు నలుగురు రెండు రోజులు ఉండడానికి రూమ్ కావాలని అడగగా తన ఇంట్లోనే ఒక ఖాళీగా ఉన్న గదిలో ఉండమని చెప్పగా అదే రోజు రాత్రి ఎదురుగడ్డకు చెందిన పాషా వెంకటేశ్వర్లు నవీన్ రవి అనే నలుగురు వ్యక్తులు రూమ్ లో ఉండి మరుసటి రోజు ఉదయం బయటికి వెళ్లి వస్తామని చెప్పి బయటికి వెళ్లిపోయారని అన్నారు. మధ్యాహ్నం సమయంలో శేషగిరి కి ఫోన్ చేసి రూమ్ లో ఖరీదైన వస్తువు ఉంచామని అది కనిపించడం లేదని ఈ విషయాన్ని వినోద్ కు తెలిపారు. దీంతో వినోద్ కూడా బావ శేషగిరిని అవమాన పరుస్తూ ఎక్కడ ఉందో చెప్పమని నిలదీశారని అన్నారు విధి నిమిత్తం వేరే ఊరికి వెళ్ళిన శేషగిరి ఇంటికి తిరిగి వచ్చి వారితో తనకు ఏ వస్తువు గురించి తెలియదని చెప్పగా శేషగిరి ని ఎదురుగడ్డకు రావాలని చెప్పగా శేషగిరి తన తమ్ముడు నిరంజన్ తో కలిసి ఆ ప్రాంతానికి వెళ్తారని వీరిని ఎదురు గడ్డలోని రైల్వే ట్రాక్ నిర్మానుష ప్రాంతంలోకి తీసుకువెళ్లి విచక్షణ రహితంగా దాడి చేసి కోట్ల విలువైన వస్తువును నీ దగ్గర దాసి పెడితే దాన్ని మాయం చేశావని మాయమాటలు చెప్పి పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా ప్రాణ భయంతో శేషగిరి ఒప్పుకొని అందులో భాగంగా నాలుగు లక్షల 50 వేల రూపాయలను ముఠా సభ్యులకు ఇచ్చినట్టు తెలిపారు. బాధితుడు జాలరపు శేషగిరి ఇచ్చిన ఫిర్యాదుతో పాషా,వెలిశాల వినోద్, కాకటి వెంకటేశ్వర్లు, గుర్రం నవీన్, తలారి రవి, వెలిశాల కళ్యాణ,లను అరెస్టు చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్టు సిఐ రమాకాంత్ ఎస్సై జె ప్రవీణ్ తెలిపారు.