UPDATES  

 తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మృతి నివాళులర్పించిన టీడీపీ పట్టణ అధ్యక్షులు ముద్రగడ వంశీ

 

మన్యం న్యూస్, ఇల్లందు టౌన్…టేకులపల్లి మండలం బోడు ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అన్నవరపు సత్యనారాయణ(65) తీవ్ర అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ సీనియర్ నాయకులు గుడిపూడి మోహనరావు, ఇల్లందు పట్టణ అధ్యక్షులు ముద్రగడ వంశీలు సత్యనారాయణ పార్దివదేహానికి తెలుగుదేశం పార్టీ జెండా కప్పి, పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ 1982 నుంచి క్రియశిలకంగా పని చేశారని వారు మరణించడం పార్టీకి తీరని లోటు అని వారు పేర్కొన్నారు. నివాళులు అర్పించిన వారిలో టేకులపల్లి టీడీపీ నాయకులు గజేలా రామశేఖర్, గోరెంట్ల రవి, ఇల్లందు టీడీపీ నాయకులు శ్యామ్ తివారి, వినీత్ తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !