UPDATES  

 లాస్ట్ చాన్స్ విధుల్లో చేరండి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ హెచ్చరిక

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

జూనియర్ పంచాయతి కార్యదర్శుల సేవలు క్రమబద్ధీకరించాలని సమ్మెలో పాల్గొన్న జూనియర్ పంచాయతి కార్యదర్శుల మే 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సమ్మె చేస్తున్న పంచాయతి కార్యదర్శులు విధుల్లో చేరాలని సోమవారం ప్రభుత్వం జారీ చేసిన
మార్గదర్శకాలు మేరకు 9వ తేది సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరే అంశంపై సోమవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతి కార్యదర్శులు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు మే 9వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా విధులకు హాజరుకాకపోతే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని జూనియర్ పంచాయతి కార్యదర్శులు పరిగణనలోకి తీసుకుని విధుల్లో చేరాలని చెప్పారు. విధుల్లో చేరిన కార్యదర్శుల వివరాలపై నివేదిక అందచేయాలని డిపిఓను ఆదేశించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !