UPDATES  

 డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించనున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

  • డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించనున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
  • -బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, కార్యదర్శి రామిరెడ్డి

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 23

మణుగూరు మండలంలోని సమితి సింగారం పంచాయతీ పరిధి లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నందు కిడ్నీ బాధిత రోగుల కోసం సుమారు 50 లక్షల రూపాయల తో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను బుధవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, కార్యదర్శి రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి మణుగూరు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళా కార్యకర్తలు అన్ని అనుబంధసంఘాలనాయకులు,కార్యకర్తలు,సకాలంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, ప్రధాన కార్యదర్శి రామిడి. రామిరెడ్డి కోరారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !