UPDATES  

 ప్రాథమిక పాఠశాల భవనం ప్రారంభించిన రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

 

మన్యం న్యూస్ ఏటూరు నాగారం
పది రోజుల్లో పాఠశాల ప్రారం భం కానున్న నేపథ్యంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పునర్నిర్మాణం పూర్తయిన పాఠశాలను ప్రారంభించుకున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.శుక్రవారం మంగపేట మండ లంలోని బాలన్నగూడెం గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పూర్తయిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా చైర్మన్ కుసుమ జగదీష్,రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ రామచంద్రనాయక్, జిసిసి చైర్మన్ వాలియా నాయక్, ఐటీడీఏ పీవో అంకిత్,అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి,జడ్పి వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి లతో కలిసి వేదమంత్రోచరణల మధ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల రెండు వందల కోట్లతో మన ఊరు మనబడి పాఠశాలల పునర్నిర్మాణం చేపట్టామన్నా రు.పది రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మన ఊరు మన బడి కార్య క్రమంలో భాగంగా పూర్తయిన పాఠశాలలను ప్రారంభించుకుం టున్నామని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల పునర్నిర్మా ణం చేపట్టారని తెలిపారు.
జిల్లాలో పోడు పట్టాలు 24 నుండి పంపిణీ కార్యక్రమం చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారని ఆమె వివరించారు.అనంతరం మంగపేట మండల కేంద్రం 16 లక్షల ఐటిడిఏ నిధులతో నూతనంగా నిర్మించిన రెవెన్యూ అతిథి గృహం ను మంత్రి ప్రారంభిం చినారు.అనంతరం మంగపేట మండలంలోని గంపోని గుడెం లో నూతనంగా నిర్మాణం చేసిన గిరిజన ఫీలింగ్ స్టేషన్ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించా రు.ఈ కార్య క్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ గోవింద నాయక్,డిఆర్ఓ కే రమాదేవి, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ హేమలత,మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి,డి టి డబ్ల్యూ ప్రేమలత,మంగపేట తహసిల్దార్ శ్రీనివాసులు,ఎంపీడీవో శ్రీనివాస్,ప్రధాన ఉపాధ్యాయులు,సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !