బాధిత కుటుంబానికి ఎన్. ఆర్. ఐ ప్రసాద్ కూనరపు వితరణ
ఎంపీపీ గుమ్మడి గాంధీ చేతుల మీదుగా 50 కేజీల బియ్యం అందజేత
మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలోని పినపాక గ్రామానికి చెందిన కొమరం రామచంద్ర మూర్తి (49) అనే ఆదివాసీ రైతు విద్యుత్ ఘాతానికి గురై ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మండల పరిధి గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఎన్నారై కునారపు ప్రసాద్ రూ.2500 విలువైన 50 కేజీల బియ్యం వితరణగా ఇవ్వగా పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ చేతుల మీదుగా సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.అలాగే తోగ్గూడెం ఉప సర్పంచ్ బుసి శ్రీనివాసరావు 1000 రూపాయలను ఆర్థిక వితరణ అందజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక సర్పంచ్ గోగ్గల నాగేశ్వరరావు,వార్డు మెంబర్ ఉడుగుల రామచంద్రు, ఎన్ ఆర్ ఐ ప్రసాద్ కుటుంబ సభ్యులు కూనారపు బక్కయ్య, కూనారపు రాములు,కూనారపు సత్యనారాయణ,కొత్త దామోదర్ గౌడ్,బీఆర్ ఎస్ పినపాక నియోజకవర్గం యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బండ మనోజ్ కుమార్ రెడ్డి, స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.