మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు పిలుపుమేరకు సోమవారం సారపాక పట్టణ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేటీఆర్ పుట్టినరోజునీ పురస్కరించుకొని కేక్ కటింగ్ వేసి మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు అనంతరం సారపాక పట్టణంలో పలు ప్రదేశాల్లో మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి పేరిట నడుస్తున్న వర్తమానం కేసీఆర్ అని,భావి తెలంగాణకు నిలువెత్తు ఆశాకిరణం కేటీఆర్ అని,తండ్రికి తగ్గ తనయుడు మాత్రమే కాదు అని భవిష్యత్ తెలంగాణకు చెరగని సంతకం కేటీఆర్ అని,ప్రజలు మెచ్చిన నాయకుడు మన రామన్న అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సారపాక పట్టణ అధ్యక్షులు కొనకంచి శ్రీనివాస్,బూర్గంపహాడ్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,బూర్గంపహాడ్ మండల కార్యనిర్వహణ అధ్యక్షులు జలగం జగదీష్,బూర్గంపహాడ్ మండల సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్,పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు,సారపాక పట్టణ యూత్ అధ్యక్షులు సోము లక్ష్మి చైతన్య రెడ్డి,భూక్య కృష్ణ మండల నాయకులు సాయి బాబా,చుక్కపల్లి బాలాజీ,బాణోత్ శ్రీను,కర్రి నాగేశ్వరరావు,జలగం చంద్ర శేఖర్,దారా నరసింహారావు,అధ్యక్షులు కౌలూరి వీరయ్య,పట్టణ ప్రధాన కార్యదర్శి పంగి సురేష్,మాజీ ఎంపిటిసి దాసరి వెంకటరమణ,ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సూదిపాక ఈశ్వర్,యూత్ నాయకురాలు బేబీ రాణి,యూత్ నాయకులు కాధర్,చిలికాని శివ,రాయల నరేంద్ర,గొడ్ల రాజు,భూక్య చిరంజీవి,శ్రీకాంత్,దేవులపల్లి గురవయ్య తదితరులు పాల్గొన్నారు.