కాంగ్రెస్ బైక్ ర్యాలీ
హాజరైన పొంగులేటి, పొదెం వీరయ్య
మణుగూరు :
పినపాక నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు పొదేం వీరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాయంవెంకటేశ్వర్లు , ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య,అశ్వాపురం మండలం ఎంపీపీ ముత్తినేనిసుజాత తదితరులు పాల్గొన్నారు