మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 14: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అశ్వారావుపేట మండలం దబ్బతోగు గ్రామానికి చెందిన పాయం మనోజ్ కుటుంబ సభ్యులకు అశ్వారావుపేట జనసేన పార్టీ తరపున నియోజకవర్గం ఇంచార్జ్ డేగల రామచంద్రరావు 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సోమవారం బాధ్యత కుటుంబం ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లం రామకృష్ణ, అడ్డూరి అనిల్, బద్దిరెడ్డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.