మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 16: మండల పరిధిలోని జమ్మిగుడెం గ్రామంలో గ్రామ ప్రజలకు విడ్స్ ఎన్జీవో కౌన్సిలర్స్ ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్స్ వి అంజిబాబు డి చంటి లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష యోజన ఇన్సూరెన్స్ లు ఉపయోగించుకోవాలని, ప్రభుత్వ బ్యాంకుల్లో లోన్స్ తీసుకున్న సకాలంలో చెల్లించి సివిల్ స్కోర్ తగ్గకుండా జాగ్రత్త పడాలని అదేవిధంగా ఆర్థిక సైబర్ నేరగాళ్లు పట్ల జాగ్రత్త వహించాలని, ఫోన్ ద్వారా ఎటువంటి వ్యక్తిగత వివరాలు ఎవరికి తెలియజేయకూడదని, ఫోన్ లోకి వచ్చే లింక్స్ తెలియకుండా ఓపెన్ చేయకూడదని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెన్నాడ సూర్య కళ, మాజీ సర్పంచ్ మిద్దిన కొండయ్య, వార్డ్ మెంబర్స్, కార్యదర్శి స్పందన, డ్వాక్ర మహిళలు, పంచాయి సిబ్బంది, గ్రామ యువకులు పలువురు పాల్గొన్నారు.