- చందమామపై కాలుమోపిన విక్రమ్ ల్యాండర్.
- చంద్రుడిపై సేఫ్ గా ల్యాండై చరిత్ర సృష్టించిన చంద్రయాన్ 3
- చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అవడం సంతోషం
- శాస్త్రవేత్తలు,పరిశోధకులు,సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 23
చందమామపై భారత్ చెరగని ముద్రవేసిందని,చరిత్రాత్మక ఘట్టంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త చరిత్రను లిఖించిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు.ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తుండగా,కోట్లాది భారతీయుల ప్రార్థనలు ఫలించగా, చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 మిషన్ ‘ల్యాండర్ విక్రమ్’ విజయవంతంగా సాఫ్ట్గా ల్యాడ్ అవడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు తెలిపారు.చంద్రుడిపై పరిశోధనల కోసం జులై 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టింది అన్నారు.బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ముద్దాడింది అని,దీంతో అమెరికా,సోవియెట్ యూనియన్ రష్యా,చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది అన్నారు.అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది అన్నారు.ఇంతటి మహత్తర కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినశాస్త్రవేత్తలు,పరిశోధకులు,సాంకేతిక నిపుణులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శుభాకాంక్షలు తెలిపారు.ఇస్రో మున్ముందు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు విప్ రేగా తెలిపారు.