మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం మామిడి గుండాల గ్రామపంచాయతీకి చెందిన ఎట్టి వీరభద్రం మాతృమూర్తి బుచ్చమ్మ వారం క్రితం అనారోగ్యంతో మరణించారు. మంగళవారం జరిగిన దశదిన కర్మలు కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ హాజరై చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచ్ కుంజ కృష్ణ, సుర్ణపాక ప్రభాకర్, సుర్ణపాక శివ, మాడే రమేష్, భూక్య హుస్సేన్, గూగులోతు బాలాజీ, తదితరులు ఉన్నారు.
