మన్యం న్యూస్, పినపాక:
డెంగ్యూ జ్వరం మండల వాసులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇటీవలనే డెంగ్యూ జ్వరంతో మండలానికి చెందిన ఒకరు మృతి చెందగా, ఉప్పాక గ్రామానికి చెందిన తోలెం నాగమణి (28) గత మూడు రోజుల నుండి జ్వరంతో బాధపడుతూ, మణుగూరు లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం నాడు మరణించింది. మృతురాలికి భర్త, ముగ్గురు ఇద్దరు కూతుర్లు ,ఒక కొడుకు ఉన్నారు. వరుస మరణాలు సంభవిస్తుండంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.