మన్యం న్యూస్ బూర్గంపహడ్:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,బూర్గంపహాడ్ మండల పరిధిలోని,మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన పాండవుల సాయిగీత అనే గర్భిణీ మహిళ ప్రసవం కోసం భద్రాచల పట్టణంలోని శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స కొరకై అడ్మిన్ కాగా,గురువారం ఉదయం 9 గంటలకు శ్రీ సురక్ష హాస్పిటల్ లోని ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ సూరపనేని శ్రీక్రాంతి సాయిగీత అనే మహిళకు శస్త్ర చికిత్స నిర్వహించగా ఆమెకు కవలలు జన్మించారు.కాగా రక్షాబంధన్ రోజున అన్నాచెల్లెళ్ల బంధానికి మారు రూపుగా అన్న,చెల్లి లు కవలలు గా జన్మించటం విశేషంగా చోటు చేసుకుంది.రక్షాబంధన్ రోజున అన్న చెల్లి జన్మించడం కుటుంబ సభ్యులను ఆనంద మయంలోకి దింపింది,శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ సురపనేని శ్రీక్రాంతి కి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు డైరెక్టర్స్ డాక్టర్ అక్కినేని లోకేష్,డాక్టర్ సూరపనేని శ్రీక్రాంతి మాట్లాడుతూ రక్షాబంధన్ రోజున మా శ్రీ సురక్ష హాస్పటల్ నందు మొదటి కాన్పు లోనే కవలలు అన్నా ,చెల్లి కి జన్మనివ్వడం చాలా సంతోషంగా ఉందని,అలాగే తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారని తెలిపారు.అన్నా,చెల్లెళ్ళ కు ఈ రోజు ఓ తీపి రోజు అని,సురక్ష ఆసుపత్రిలో రక్షా బంధన్ రోజు జన్మించి ఈ పిల్లలు ‘సు’రక్షా బంధంని నింపారు అని వారు అన్నారు.