అభివృద్ధికి మరో మారు పట్టం కట్టండి
రూ 8 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రేగా
మన్యం న్యూస్,మణుగూరు:
మండలం లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి బాంబే కాలనీ వరకు రోడ్డు వైడెనింగ్ , డివైడర్లు మరియు సెంట్రల్ లైటింగ్ కోసం ఎస్డీఎఫ్ నిధులతో సుమారు 8 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రలో సీఎం కేసీఆర్ సహకారంతో పినపాక నియోజకవర్గం లో అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి అద్భుతమైన పరిపాలన చూసి దేశంలోని రాష్ట్రాలు రాజకీయ పార్టీల నాయకులు అభిమానులుగా మారుతున్నారని తెలిపారు, దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మా గురు మండల బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు,బి.ఆర్.ఎస్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.