అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి
విప్ రేగా కాంతారావు ,డా తెల్లం కి రాఖీ కట్టిన… వారి చెల్లెలు రేగా జయలక్ష్మి,రేగా సునీత
మన్యం న్యూస్,ముఖ్నుగూర్8:
మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు , భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్ రావు కు రేగా సోదరీమణులు రేగా జయలక్ష్మి , రేగా సునీత రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకున్నారు, అనంతరం వారికి అక్షంతలు వేసి ఆశీర్వదించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీకగా తెలుస్తుందని ఈ పర్వదినాన్ని రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా జరుపుకొని ఆడపడుచులు సోదరుల ఆశీస్సులు పొందాలని అన్నారు అనంతరం మిఠాయిలును తినిపించి సంతోషం పంచుకున్నారు, అనంతరం భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్ రావు ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వారిని ఘనంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి శాలువతో సత్కరించడం జరిగింది.