మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నాడని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే రోల్డ్ మోడల్ అని పేర్కొన్నారు. గురువారం రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే వనమా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుంచుపల్లి కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించిన లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ కింద సుమారు 60 లక్షల రూపాయల చెక్కులను అందించడం జరిగిందన్నారు. పేదింటి ఆడపిల్లలకు పెద్దన్నగా కేసీఆర్ ముందుకు పోతున్నారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నా తుది శ్వాస వరకు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, చుంచుపల్లి ఎంపీపీ బాదవత్ శాంతి, తాసిల్దార్ పుల్లయ్య, కౌన్సిలర్ సహారా బేగం, మోరే రూప, కూరపాటి విజయలక్ష్మి, అంబుల వేణు, కంచర్ల జములయ్య, విజయ్ ఎంపీటీసీ భుఖ్య రుక్మిణి, సర్పంచులు వెంకటమ్మ, బిఆర్ఎస్ నాయకులు భీమా శ్రీధర్, యూసుఫ్, రావి రాంబాబు, కంభంపాటి దుర్గాప్రసాద్, మసూద్, సుందర్ రాజ్, మోర్ రమేష్, డాబా నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ రుక్మిణి, నగేష్, వెంకన్న, పెయింటర్ రాజేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.