మన్యం న్యూస్ ,మణుగూరు:మండల పరిధి బొంబాయి కాలనీ లోని ఎక్సలెంట్ స్కూల్లో కృష్ణ జన్మాష్టమిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు రాధాకృష్ణుని వేషాధరణతో అలరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గోపిక, కృష్ణులుగా అలకంరించారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని కేరింతలు కొట్టారు. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా చిన్నారులు కోలాటాలు నిర్వహించారు. చిన్నారుల వేష దారణులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, స్కూల్ కరస్పాండెంట్ జే.ఎం ఖాన్ ప్రిన్సిపాల్ బాను ఖాన్, టీచర్లు పాల్గొన్నారు.