*ఇంటింటికి సి ఎం కేసీఆర్ అభివృద్ధి కరపత్రాల పంపిణీ కార్యక్రమం.
మన్యం న్యూస్, కరకగూడెం: మండల పరిధిలోని చొప్పాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అదేశాల మేరకు ఇంటింటికి బిఅర్ఎస్ పార్టీ ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినా అభివృద్ధి పనులను వివరించారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావు సోమయ్య,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, రఘునాదపాలెం సర్పంచ్ పోలెబోయిన నరసింహరావు ఉపసర్పంచ్ బోడా ప్రశాంత్ సీనియర్ నాయకులు రేగా సత్యనారాయణ జవ్వాజి.సమ్మయ్య చప్పిడి.వెంకటేశ్వర్లు సోషల్ అధ్యక్షులు చిట్టిమల్ల. ప్రవీణ్ కుమార్,బొడా.ముత్తయ్య,కొండగొర్ల.నరసింహరావు గోగు.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
