UPDATES  

 ఘనంగా ప్రారంభమైనా మండల‌ స్థాయి క్రీడలు – క్రీడా జెండాను ఆవిష్కరించినఎంపిపి గుమ్మడి గాంధీ

మన్యం న్యూస్ ,పినపాక: మండలంలోని జానంపేట పంచాయతీ లోని జిల్లా పరిషత్ పాఠశాల లో శుక్రవారం ఘనంగా మండల స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలకు పినపాక ఎంపిపి గుమ్మడి గాంధీ ముఖ్య అతిధిగా పాల్గోని క్రీడా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపిపి‌ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ… విద్యార్థులుకి చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని,క్రీడలు వల్ల శరీరం దారుడ్యంగా ఉంటుందని అన్నారు.చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. ఎల్చిరెడ్డి పల్లి విద్యార్థులు సంస్కృత కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణ,అత్మ కమిటి చైర్మన్ పోనుగోటి భధ్రయ్య,సొసైటీ చైర్మన్ రవి శేఖర్ వర్మ,పాఠశాల కమిటి చైర్మన్ మహాలక్ష్మి, వ్యాయమ ఉపాధ్యాయులు పోలెబోయిన అనిల్ కూమర్, విజయ లక్ష్మి,భాయమ్మ,ఆదినారాయణ,వీరన్న,జనార్థన్,దశమి బాబు,ఉపాధ్యాయులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !