UPDATES  

 సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణ విద్రోహదినమే

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

మన్యం న్యూస్,ఇల్లందు:సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణ విద్రోహ దినమే అని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్రనాయకులు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యకార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో గుమ్మడి నరసయ్య పాల్గొని నిజాం మూడురోజులలో లొంగిపోయి ఒప్పందం చేసుకుని నజరానాలు, రాజ్ ప్రముఖ బిరుదు అందుకున్నాడన్నారు. పటేల్ సైన్యం తెలంగాణాలో కమ్యూనిస్టులను వేటాడిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బుర్ర వెంకన్న, పట్టణ కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, నాయకులు పిల్లి మల్లేష్, వీరన్న, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వి, శ్రీశ్రీ, గణేష్, పార్ధు, తరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !