మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని ఎన్నికల సీజన్ నేపథ్యంలో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు
ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీన జరగాల్సి ఉన్న ప్రజావాణి కార్యక్రమాన్ని సైతం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి ఉండదని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఎన్నికల విధుల నిర్వహణలో భాగస్వాములైనందున ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించి కలెక్టరేట్ కు రావద్దని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా విజ్ఞప్తి చేశారు.