మన్యం న్యూస్ కరకగూడెం:కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇగ్బాల్ హుస్సేన్ ,మండల నాయకులు ఎర్ర సురేష్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు..
అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లడుతు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సుఖ సంతోషాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో
చిరుమళ్ళ ఉప సర్పంచ్ కొమరం వెంకటేశ్వర్లు, పినపాక నియోజకవర్గ యూత్ జనరల్ సెక్రటరీ మిట్టపల్లి నితిన్,నాగ బండి వెంకటేశ్వర్లు,చంద నాగేశ్వరరావు,షేక్ రఫీ, మండల యువజన అధ్యక్షులు కునసోత్ సాగర్,బుడుగుల మధు, నాయకులు జలగం కృష్ణ, కోరగట్ల విశ్వనాథం, గొగ్గలి రవి తదితరులు పాల్గొన్నారు.
