UPDATES  

 బిఆర్ఎస్ పార్టీ ప్రచార రథాలను ప్రారంభించిన వేల్పూరి..

మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.

వెంకటాపురం మండలం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద మంగళవారం బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు విజయాన్ని కాంక్షిస్తూ భద్రాచలం నియోజకవర్గం లో డాక్టర్ తెల్ల వెంకటరావు ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వెంకటాపురం మండలంలో శివాలయం దగ్గర స్థానిక ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా ప్రచార రథాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు పూనం శ్రీదేవి, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పిల్లారిసెట్టి మురళి, బిఆర్ఎస్ అధికార ప్రతినిధి డర్ర దామోదర్, రాసపల్లి సర్పంచ్ స్వర్లం సమ్మయ్య, సీనియర్ నాయకులు నాయకులు శాంతమూర్తి యాదవ్ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గొర్ల శ్రీను, బిఆర్ఎస్ ఉపాధ్యక్షులు జాగర్ శివాజీ యాదవ్, మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు కిరణ్ ,బోంల్లె శంకర్రావు, మల్లేష్, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !