- ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
- సామాన్యుడి కోసం కేసీఆర్ సంకల్పం బిఆర్ఎస్ మ్యానిఫెస్టో ను ఆవిష్కరించిన
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మణుగూరు మండలం లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు బుధవారం నాడు సామాన్యుడి కోసం కేసీఆర్ సంకల్పం బిఆర్ఎస్ మ్యానిఫెస్టో ను బిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పెద్దలతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,ముస్లిం మైనార్టీ ల సంక్షేమ,అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ,పెద్దపీట వేసింది అన్నారు.బిఆర్ఎస్ పాలనలో ముస్లింల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు.పేద ముస్లింలకు కార్పొరేట్ విద్య అందించేందుకు రాష్ట్రంలో వారికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అందిస్తున్నట్లు వారు తెలిపారు అన్ని మతాలకు సమ ప్రాధాన్యతను ఇచ్చి సీఎం కేసీఅర్,బిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మైనార్టీ ఆడబిడ్డల పెళ్ళిలకు షాదీ ముబారక్ పథకం కింద 1 లక్ష 116 రూపాయలను ప్రభుత్వం అందిస్తున్నది అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాష మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు హబీబ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యూసఫ్ షరీఫ్, ముస్లిం మత పెద్దలు,బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు ఆదమ్ తదితరులు పాల్గొన్నారు.