మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
మండలంలోని సీతానగరం గ్రామ శివారులో గల బిఎస్ఎన్ఎల్ టవర్కు సంబంధించిన 40 సోలార్ బ్యాటరీలు చోరీకి గురయ్యాయి.
గుబ్బలమంగి బ్రిడ్జి సమీపంలో గల ఈ టవర్ బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్లు బిఎస్ఎన్ఎల్ అధికారులు గుర్తించారు.ఈ విషయంపై స్థానిక పోలీసులకు సమాచారం తెలపగా ఎస్సై కేశవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.