యాపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్లు, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, యాపిల్ టీవీ ఓఎస్, సఫారీ బ్రౌజర్లలో భద్రతా లోపాలను కేంద్ర ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-IN) గుర్తించింది. ఆపిల్ ఉత్పత్తుల్లోని లోపాలను హ్యాకర్లు ఉపయోగించుకుని కీలక సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని CERT-IN అభిప్రాయపడింది. వినియోగదారులు తమ OSని తాజా వెర్షన్లతో అప్డేట్ చేయాలని CERT-IN స్పష్టం చేసింది.
