కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి యూపీలోని సుల్తాన్పూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాహుల్పై బీజేపీ నేత విజయ్ మిశ్రా 2018 ఆగస్టు 4న పిటిషన్ వేశారు. ఈ కేసులో తాజాగా రాహుల్కు కోర్టు సమన్లు పంపింది. శనివారం హాజరుకావాలని గతంలో కోర్టు రాహుల్ను ఆదేశించినా ఆయన హాజరుకాలేదని మిశ్రా తరపు న్యాయవాది సంతోష్ పాండే తెలిపారు.
