మూడు నెలలకు పైగా తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉర్రూతలూగించిన బిగ్ బాస్ సీజన్-7 టైటిల్ ను ‘రైతు బిడ్డ’ పల్లవి ప్రశాంత్ కైవసం చేసుకున్నాడు. ఇవాళ ఎంతో ఉత్సాహభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలే చివర్లో బిగ్ బాస్ ఇంట్లో మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరిలను హోస్ట్ నాగార్జున స్టేజిపైకి తీసుకువచ్చారు. అనంతరం.. పల్లవి ప్రశాంత్ విజేత అంటూ అనౌన్స్ చేశారు. అమర్ దీప్ చౌదరిని రన్నరప్ గా ప్రకటించారు.
