UPDATES  

 2024 రిపబ్లిక్ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు..

2024 భారత దేశ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్‌ హాజరుకానున్నారు. అంతకుముందు ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించినట్లు అమెరికా రాయబారి అధికారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు. అయితే వివిధ కారణాలు వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని జో బైడెన్ వెల్లడించారు. ఈ కారణంగానే ఫ్రాన్స్ అధ్యక్షుడిని రిపబ్లిక్ వేడుకలకు ఆహ్వానించినట్లు తెలుస్తుంది.

 

గతఏడాది జూలైలో పారిస్‌లో జరిగిన బాస్టిల్ డే వేడుకలకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇండియాలో జరిగిన జీ20 సమావేశాలకు ప్రాన్స్ ప్రధానమంత్రి హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీతో కీలక చర్చలు జరిగాయని వెల్లడించారు. ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య మైత్రి మరింత బలపడిందన్నారు. గత ఏడాది ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్ కు మోదీ హాజరుకావడాన్ని తమ దేశ ప్రజలు గౌరవంగా భావిస్తున్నారని తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !