ఒకే దేశం – ఒకే ఎన్నిక‘పై అధ్యయనానికి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జనవరి 15లోగా ప్రజలు తమ సలహాలు, సూచనలు పంపవచ్చని వెల్లడించింది. ఇప్పటివరకు 5వేలకు పైగా ఈ-మెయిళ్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఒకే దేశం- ఒకే ఎన్నిక కోసం గతేడాది సెప్టెంబరులో ఈ కమిటీ ఏర్పాటైంది. 6 జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. న్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు తీసుకుంది.
