చైనా నుంచి వచ్చే వీల్ లోడర్స్, జిప్సమ్ టైల్స్, ఇండస్ట్రియల్ లేజర్ మెషినరీలపై భారత్ దిగుమతి నిరోధక (యాంటీ డంపింగ్) సుంకం విధించింది. ఈ ఉత్పత్తులు భారత్ మార్కెట్లో సాధారణ విలువ కంటే తక్కువ ధరకే దిగుమతి అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారని తేల్చారు. దీన్ని అరికట్టేందుకు ఐదేళ్ల కాలానికి ట్యాక్స్ విధించింది.
