ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘హనుమాన్’. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ పూర్తయిన అనంతరం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ సినిమా సీక్వెల్ రాబోతుందని వెల్లడించాడు. పార్ట్ 1 ‘హన్మాన్’ కాగా.. పార్ట్ 2 ‘జై హనుమాన్’ అని టైటిల్ ఫిక్స్ చేశాడు. 2025లో పార్ట్ 2 రాబోతుందని వెల్లడించాడు.
