అయోధ్య రాముడికి ‘హనుమాన్’ చిత్రబృందం విరాళం అందజేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డిలు ఈ మూవీపై వచ్చే లాభంలో ఐదు రూపాయలు అయోధ్య రామాలయానికి విరాళం ఇస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారమే హనుమాన్ ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన రూ.14.25 లక్షలను అయోధ్యకు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని శనివారం చిత్రబృందం అధికారికంగా తెలిపింది.
