అయోధ్య రామమందిరాన్ని టాటా, ఎల్ అండ్ టీ కంపెనీలు అధునాతన టెక్నాలజీతో నిర్మించాయి. ఆలయ నిర్మాణానికి 150 మంది ఇంజినీర్లు, వేల సంఖ్యలో కార్మికులు రేయింబవళ్లు కష్టపడ్డారు. 6.5 తీవ్రతతో భూకంపాలు వచ్చినా తట్టుకునే సామర్థ్యం ఆలయానికి ఉంది. నేపాల్ నుంచి అయోధ్య వరకు భూకంప తీవ్రతను కొలిచే నిపుణుల బృందం రిపోర్టునిచ్చింది. అలాగే, భవిష్యత్తులో వరదలు వచ్చినా రామమందిరంపై ప్రభావం పడకుండా డిజైన్ చేశారు.
