UPDATES  

 వివాదంలో చిక్కుకున్న నాగార్జున, ధనుష్ మూవీ..

అక్కినేని నాగార్జున నటిస్తోన్న కొత్త మల్టీస్టారర్ చిత్రానికి తాజాగా షాక్ తగిలింది. షూటింగ్ ఆపాలంటూ అధికారులు అనుమతులు రద్దు చేశారు. ఇంతకీ నాగ్ నటిస్తోన్న ఆ కొత్త చిత్రం ఏంటి?.. ఎందువల్ల షూటింగ్ ఆగిపోయింది?.. అనే విషయానికొస్తే..

 

డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో ధనుష్ మెయిన్ హీరోగా నటిస్తుండగా.. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘DNS’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీకి తాజాగా ఓ షాక్ తగిలింది. తిరుపతిలోని అలిపిరిలో జరుగుతున్న ఈ మూవీ చిత్రీకరణ అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీనికి ప్రధాన కారణం ట్రాఫిక్ అని తెలుస్తోంది.

 

అయితే ఈ మూవీ యూనిట్ అలిపిరితో పాటు గోవింద స్వామి ఆలయం, నంది కూడలిలో షూటింగ్ చేసుకోవడానికి ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకుంది. అయితే షూటింగ్ కారణంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకూడదని, అలాగే సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల బందోబస్తుకు కూడా పోలీసులను పంపలేమని అధికారులు మూవీ యూనిట్‌కి షరతులు విధించిందట.

 

ఈ నేపథ్యంలో షూటింగ్ సమయంలో శ్రీవారి దర్శనానికి వెళ్లి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అదే సమయంలో ఫుల్ ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో ఆ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడంలో మూవీ యూనిట్ పూర్తిగా విఫలం అయింది. ఈ కారణంగా వివాదం మొదలైంది. ఆధ్యాత్మిక క్షేత్రంలో సినిమా షూటింగ్‌లకు అనుమతిని ఎలా ఇస్తారంటూ పలువురు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ తరుణంలోనే నేడు జరగవలసిన షూటింగ్‌కు పోలీసులు అనుమతులను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !