UPDATES  

 సరిహద్దులు దాటుతున్న అడవి ఉత్పత్తులు..

  • సరిహద్దులు దాటుతున్న అడవి ఉత్పత్తులు
  • ముష్టి గింజలను చతిస్గడ్ తరలించి సొమ్ము చేసుకుంటున్న దళారులు

మన్యం న్యూస్ గుండాల: మండలంలోని అడవి ఉత్పత్తులు సరిహద్దులు దాటుతున్నాయి. ముష్టి గింజలను చతిస్గడ్ రాష్ట్రానికి తరలించి దళారులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. చతిస్గడ్ రాష్ట్రంలో కేజీ 120 రూపాయలు పలుకుతుండడంతో గుండాల మండలంలో కేజీ 30 నుండి 40 రూపాయలకు సేకరించి వాటిని సరిహద్దులు దాటించి అధిక ధరకు విక్రయించి లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు ఇప్పటికే గుండాల మండలం నుండి ఒక దళారి రెండు వేల క్వింటాలకు పైగా తక్కువ ధరకే కొనుగోలు చేసి తరలించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా ఫారెస్ట్, విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి దరారులపై చర్యలు తీసుకోవాలని గిరిజన ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. జిసిసి ద్వారా కొనుగోలు చేస్తే దళారీ వ్యవస్థకు అడ్డుకట్టవేచ్చని ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లపుచ్చుకుంటున్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !