UPDATES  

 తహసీల్దార్ ఆధ్వర్యంలో భక్తులకు తాత్కాలిక బస్సు స్టాప్ ఏర్పాటు..

 

మన్యం న్యూస్ మంగపేట.

మేడారం మహా జాతర సందర్బంగా మంగపేట లో మేడారం వెళ్లే భక్తుల సౌకర్యం దృష్టిలో పెట్టుకొని తహసీల్దార్ వీరాస్వామి రైతు వేదిక వద్ద తాత్కాలిక బస్సు స్టాప్ ఏర్పాటు చేయడమైనది.

ఈ నెల 18 నుండి జాతర పూర్తి అయ్యేంత వరకు బస్సులు నడపనున్నారు. ఈ సందర్బంగా తహసీల్దార్ వీరాస్వామి మేడారం మహా జాతర ను దృష్టిలో పెట్టుకొని భక్తుల సౌకర్యర్థం ఏర్పాటు చేయవలసిన సౌకర్యాల పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !