టాలీవుడ్ హీరో అడివిశేష్ నటిస్తున్న తాజా చిత్రం జీ 2. 2018లో శేష్ హీరోగా వచ్చిన బ్లాక్బస్టర్ సినిమా ‘గూఢచారి’కి సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాకు వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ‘జీ 2’లో విలన్గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ బనితా సంధు నటించనుంది.
