భారత్లోకి అక్రమ చొరబాటు కార్యకలాపాల్లో ఉగ్రమూకలకు సాయంగా ఇటీవల కాలంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి టెలికాం టవర్ల సంఖ్యను పెంచినట్లు భారత అధికారిక వర్గాలు వెల్లడించాయి. జమ్మూ-కశ్మీర్లోని బారాముల్లా, రాజౌరీ, పూంఛ్ తదితర జిల్లాలను ప్రభావితం చేస్తూ.. పీవోకే నుంచి టెలికాం సంకేతాలు భారత భూభాగంలోకి చొచ్చుకొస్తున్నాయని భద్రతా ఏజెన్సీలు హెచ్చరించిన వేళ ఇది బయటపడింది
