పశ్చిమబెంగాల్లోని శిలిగుడి సఫారీ పార్కులో మగ, ఆడ సింహాలకు అక్బర్, సీత అని పేర్లు పెట్టడం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఆ పేర్లు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విశ్వహిందూ పరిషత్ కోల్కతా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు.. రెండు సింహాల పేర్లను మార్చడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
