- పల్లెల్లో రెచ్చిపోతున్న సిండికేట్ దందా
- సుక్క తాగుదామంటే చుక్కలు చూపిస్తున్న వారి సొంత ధరలు.
- ఎమ్మార్పీ కంటే అదనంగా 60 రూపాయలకు విక్రయాలు.
- గిరిజనుల పేరు చెప్పి లక్షల రూపాయలు దండుకుంటున్న
- సిండికేట్లు.
- ఇంత జరుగుతున్న
- జాడలేని ఎక్సైజ్ శాఖ అధికారులు.
మన్యం న్యూస్ నూగుర్ వెంకటాపురం.
వెంకటాపురం మండల కేంద్రంలో చిలకమ్మ వైన్స్, శివశక్తి వైన్ షాపుల దందా రోజు రోజుకు హద్దు అదుపు లేకుండా పోతుంది గిరిజనుల పేరుతో వచ్చిన వైన్ షాపులు. గిరిజనేతరుల చేతులకు వెళ్లిపోయాయి. ఈ రెండు వైన్ షాపులు గతంలో బీ ఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఒక నాయకుడు ఆధీనంలో ఉన్నట్టు పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అంత నేను చూసుకుంటాను అని సహచర్లకు అభయహస్తం ఇచ్చినట్టుగా మండలంలో గుసగుసలు వినబడుతున్నాయి.
ఆయన అండతో సిండికేట్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా యదేచ్చగా సాగుతున్నాయీ. అని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
పైకి శ్రీరామ నీతులు చెబుతున్న వైన్ షాప్ యాజమాన్యాలు, సరుకoత్త బెల్ట్ షాపులకు తరలించి ఇరువురు 60 రూపాయలకు కోటరు అదనంగా అమ్మాలని ఒప్పందం కుదుర్చుకొని విక్రయాలు జరుపుతున్న పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి.వైన్ షాప్ లో ఎమ్మార్పీ ధరలకే ఇస్తున్న మనీ చెప్పడానికి నాలుగు కోటర్లు నాలుగు బీర్లు రెండు ఫుల్ బాటిళ్లు చూపడానికి కౌంటర్ ముందు పెట్టుకొని వారి దందాను ప్రశ్నించడానికి వచ్చిన వారికి ఎంఆర్పికే అమ్ముతున్నాము అన్న విధంగా కలరింగ్ ఇస్తూ బెల్ట్ షాపులకు ఇచ్చిన సరుకుని మాత్రం 60 రూపాయలు అదనంగా అమ్ముతునా, విషయాన్ని కప్పి పెట్ట డానికి వారు వేసే ఎత్తుగడలు రామాయణంలో శకుని కి కూడా రాని విధంగా పైఎత్తులు వేస్తున్న పరిస్థితులు అబ్బురపరుస్తున్నాయి అంటూ మండల ప్రజలు వాపోతున్నారు. మందు బాబులకు కావలసిన క్వార్టర్లు వైన్ షాపులో దొరకకుండా బెల్ట్ షాపులకు తరలించి 60 రూపాయలు అదనంగా అమ్ముతూ ఉండడంతో వైన్ షాప్ దగ్గర కంటే బెల్ట్ షాపులలోనే మందుబాబులు మందును కొనక తప్పడం లేదు, అని ఉన్న బ్రాండ్లన్నీ బెల్ట్ షాపులకు ఇచ్చేసి నాలుగైదు బ్రాండ్లను వైన్ షాపులో విక్రయించే పరిస్థితులు ఉన్నాయంటూ మందు బాబులు వారి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వారికి కావలసిన కోటర్ వైన్ షాపులో దొరకపోవడంతో బెల్టు షాపును ఆశ్రయిస్తూ ఎక్కువ డబ్బులు చెల్లించుకొని తాగవలసిన పరిస్థితులు వస్తున్నాయంటూ పలువురు మందుబాబులు వైన్ షాప్ యాజమాన్యాలపై మండిపడుతున్నారు.
క్వార్టర్ మీద 60 రూపాయలు అదనంగా విక్రయించే వారిని ఆపడానికి ఎక్సైజ్ అధికారుల జాడ కూడా మండలంలో కరువైందని గాలికి నిప్పుతోడైనట్టుగా వారి నిర్లక్ష్యం వీరి విక్రయాలకు పచ్చ జెండా ఊపినంత ఉత్సాహం ఇచ్చింది అంటూ ఇదే అదునుగా వారు ధరలు ఆకాశానికి పెంచుతున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు.
రోజు కు 300 సంపాదించే మాకు సాయంత్రం పని దిగి చుక్క తాగుదాం అనుకుంటే ధరలు చుక్కలు చూపిస్తున్నాయంటూ
వారి గోడు వెళ్లబుచ్చారు .ఇదిలా ఉండగా అధిక రేట్ల విషయమై ప్రశ్నించడానికి వెళ్లిన పాత్రికేయులతో వ్యంగంగా మాట్లాడడం వారి వ్యాపారం వెనక చీకటి దొంగలు ఎవరో గట్టిగాఉన్నట్టుగా వారి చర్యలు చెప్పకనే చెప్తున్నాయి.
ఇకనైనా సంబంధిత అధికారులు ఈ సిండికేట్ దందాపై చర్యలు తీసుకొని అధిక ధరలు నియంత్రించి ఎంఆర్పి రేట్లకు అమ్మే విధంగా చర్యలు చేపట్టాలని. మండల ప్రజలు పత్రికాముఖంగా కోరుతున్నారు.