- రక్షణ నిల్లు సెలబ్రేషన్స్ ఫుళ్ళు.
- నాలుగు రాష్ట్రాలు మూడు పట్టణాలు స్వేచ్ఛగా చైతన్యంతో ఉన్నంత మాత్రాన
- దేశంలో మహిళలు సురక్షితమేన.
- బాలికలపై జరిగే అత్యాచారాలు మాటేమిటి.?
- మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన తీరు చూసి మహిళా దినోత్సవం జరుపుకోవాలా .
- మహిళలకు పూర్తిస్థాయి రక్షణ ఎప్పుడు లభిస్తుంది.?
మన్యం న్యూస్ నూగూరు వెంకటాపురం.
ప్రపంచ దేశాలలో సైతం మాతృత్వం అనగానే వెంటనే గుర్తుకు వచ్చే మనిషి ఒక స్త్రీ. అటువంటి స్త్రీకి నేటికీ కనీస మానవ హక్కులు లేవు, అనుకున్నది చేసే స్వేచ్చలేదు, ఆర్థిక స్వతంత్రం పూర్తిస్థాయి అధికారం అసలే లేదు. తరతరాలుగా చిన్నచూపు చూడబడుతున్న ఒక స్త్రీ నేటికీ పూర్తిస్థాయి చట్టాలు అమలు కాక మతపరంగాను, రాజకీయంగాను, దౌర్జన్యాలకు గురికాక తప్పడం లేదు. అసమానతలతో అనాదికాలం నుంచి ఆధునిక యుగం వరకు అతివలు వివక్షకు గురవుతూనే ఉన్నారు.
సమానత్వం లేని ఈ సమాజంలో స్వయాన భారత ప్రెసిడెంట్ ద్రౌపతి ముర్ము కూడా బలయ్యారు అంటే అతిశయోక్తి కాదు. భర్త లేడు అన్న ఒక కారణంతో కొన్ని మీటింగులకు గుడి దర్శించుటకు ఆమెకు ప్రవేశం కూడా ఇవ్వకుండా చేసిన రాజకీయపరమైన కొన్ని కుట్రలు దేశంలో సమానత్వం లేదు అన్న ఛాయాల్ని గుప్పించాయి.
అంతేకాకుండా ఒక స్త్రీని నగ్నంగా బట్టలు విప్పించి నడిరోడ్డు మీద నడిపించిన ఈ దేశంలోని ఒక మహిళల,రక్షణ కొరకు కల్పించిన చట్టాలు ఆమెను రక్షించలేకపోయాయి. ఆ మహిళ కుటుంబమంతా చనిపోయే పరిస్థితి వచ్చింది. మహిళలపై జరిగే అత్యాచారాన్ని చూసి నేడు మహిళా దినోత్సవం జరుపుకోవాలా?.
ప్రతిరోజు బాలికలపై జరిగే అత్యాచారాలు చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా ఇట్టే కనిపెట్టేయొచ్చు ఏ పేపర్ చూసినా నాలుగో 5 కనబడుతూనే ఉంటాయి. ఇక పూర్తిగా మహిళలకు రక్షణ ఎప్పుడు లభిస్తుంది.
ఇవన్నీ నిత్యకృతమై పోతున్న కూడా ప్రభుత్వాలు ఇవేమీ పట్టించుకోకుండా భేటీ బచావో బేటి పడావో అంటూ నీతి కరమైన మాటలు చెబుతూ పబ్బం గడుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎక్కడో నాలుగు రాష్ట్రాలు అభివృద్ధి అయినంత మాత్రాన దేశంలో మహిళలు అందరూ అభివృద్ధి చెంది చైతన్యమైనట్లేనా. స్త్రీ రక్షణకై ఉన్న చట్టాలు పూర్తిగా ఎందుకు అమలు చేయడం లేదు. నిజంగా స్వేచ్ఛ వస్తే అడుగంటుకపోయినా జీవితాలతో మన్యం బిడ్డలు ఎందుకు విలవిల్లాడుతున్నారు. పాశ్చాత్య దేశాలు రాకెట్ సైన్స్ పరిజ్ఞానంతో పరిగెడుతుంటే భారతదేశంలో మహిళలు భక్తి ముసుగులో , కొంచెం శాస్త్రీయంతో ఉండడం ఏమిటి, ఇంకా కనీసం లోకజ్ఞానం లేని వారు భారత దేశంలో ఇంకా ఉన్నారు అంటే మహిళ లోకం అభివృద్ధి చెందినట్ట లేనట్టా . ఏది ఏమైనాప్పటికీ స్త్రీలు చైతన్యవంతులయ్యారని ప్రగల్బాలు పలికే ప్రభుత్వాలు ఒక విషయం తెలుసుకోవాలి ఎప్పుడైతే మహిళా అత్యాచారాలు గురించి పత్రిక పేపర్లలో ప్రచురింపబడకుండా ఉంటుందో ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా స్త్రీ తన ఇంటికి భయం లేకుండా వస్తుందో ఆరోజు నిజమైన మహిళా దినోత్సవం జరుపుకోవాలి. అంటూ కొంతమంది విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.